ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 10 మార్చి 2019 (11:46 IST)

కన్నబిడ్డ ఫ్రెండ్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న 44 యేళ్ల మహిళ

హర్యానా రాష్ట్రంలో ఓ మహిళ కామంతో కళ్ళుమూసుకుని పోయి బరితెగించింది. తన కుమారుడుతో కలిసి అపుడపుడు ఇంటికి వచ్చే ఓ యువకుడితో మహిళ అక్రమ సంబంధం పెట్టుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హర్యానా రాష్ట్రంలోని జజ్జర్ జిల్లా చమన్‌పురాకు చెందిన మీనా దేవి (44) అనే మహిళకు ప్రమోద్ (23) అనే కొడుకు ఉన్నాడు. బౌన్సర్‌గా పని చేసే ప్రమోద్‌ను కలవడానికి అతని స్నేహితుడైన ప్రదీప్ అప్పుడప్పుడు ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో మీనా, ప్రదీప్‌ మధ్య సాన్నిహిత్యం పెరిగి అది అక్రమ సంబంధానికి దారి తీసింది. 
 
అయితే కొన్ని రోజుల తర్వాత తల్లి ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆరాతీశాడు. నిజం తెలిసి మనస్తాపానికి గురైన ప్రమోద్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటి దగ్గరే ఉంటున్నాడు. అంతేకాకుండా తన స్నేహితుడిని ఇంటికి రావద్దని హెచ్చరించాడు. దీంతో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న ప్రమోద్‌ను హత్య చేయాలని మీనా, ప్రదీప్‌లు నిశ్చయించుకున్నారు. 
 
ముందుగా అనుకున్న ప్లాన్‌ ప్రకారం ప్రమోద్‌ ఇంటి వద్ద ఉన్నప్పుడు మీనా తన ప్రియుడు ప్రదీప్‌తో సహా మరో ఇద్దరినీ ఇంటికి పిలిపించి కొడుకును దారుణంగా హత్య చేయించింది. అనంతరం తన కొడుకును ఎవరో హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు... తల్లి మీనాను ప్రశ్నించగా అసలు విషయం వెల్లడైంది.