శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 15 ఆగస్టు 2017 (08:05 IST)

#IndependenceDayIndia: ఎర్రకోటపై జాతీయ జెండా రెపరెపలు..

దేశవ్యాప్తంగా 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించారు. త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు.

దేశవ్యాప్తంగా 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించారు. త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. 
 
అనంతరం ప్రధాని ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలకు హాజరైన వారికి చేతులు ఊపుతూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ, కేంద్రమంత్రులు, ఎంపీలు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, విదేశీ అతిథులు తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తూ, ‘భారత ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్య సంగ్రామంలో పోరాడిన మహానుభావులను ఈ సందర్భంగా స్మరించుకోవాలి’ అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.