శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Modified: గురువారం, 18 డిశెంబరు 2014 (10:15 IST)

జీఎస్ఎల్వీ మార్క్-3 విజయవంతం...!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో.. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగం విజయవంతమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి గురువారం ఉదయం 9:30 గంటలకు జీఎస్ఎల్వీ మార్క్-3 నింగిలోకి దూసుకెళ్లింది. అనుకున్న లక్ష్యాన్ని ఛేదించేందుకు 20 నిమిషాలు పడుతుంది. 
 
ఈ విషయమై ఇస్రో శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. ఇది కేవలం ప్రయోగాత్మకమైనదేనన్నారు. రాకెట్ పైభాగంలో మూడు వేల కిలోల కంటే బరువైన క్రూ మాడ్యూల్‌ను అమర్చినట్లు తెలిపారు. ఇది భూమి నుంచి 126 కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకు వెళ్లిన తరువాత దీనిని రాకెట్ వదిలేస్తుందన్నారు. పారాచూట్ల సాయంతో ఈ క్రూ మాడ్యూల్ తిరిగి భూమికి చేరుకుంటుందని తెలిపారు. దీనిని అండమాన్ కు సమీపంలోని దింపేందుకు ఇస్రో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.