శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 10 జనవరి 2017 (17:01 IST)

జయమ్మ మృతిపై అన్నీ పూర్తయ్యాయి.. బాధెందుకు..? శశికళపై కోపంతో అమ్మ ఆత్మ తిరుగుతుందా?

దివంగత సీఎం జయలలిత మృతికి సంబంధించి అన్నాడీఎంకే కార్యకర్త పీ ఏ జోసెఫ్ మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌కు సంబంధించి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర,

దివంగత సీఎం జయలలిత మృతికి సంబంధించి అన్నాడీఎంకే కార్యకర్త పీ ఏ జోసెఫ్ మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌కు సంబంధించి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 23లోపు వాటిని కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. ప్రజలు జయలలిత మృతి పట్ల ఉన్న అనుమానాలు నివృత్తి కావాలని, ఆమె కాళ్లను తొలగించారని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు.
 
ఆస్పత్రి యాజమాన్యం విడుదల చేసిన హెల్త్ బులిటెన్స్ మినహా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు జయలలిత అనారోగ్య స్థితికి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదని తెలిపారు. అయితే ఈ వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. జయలలిత మృతికి సంబంధించి అన్నీ పూర్తయ్యాయని, ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదని కోర్టు తెలిపింది.
 
ఇదిలా ఉంటే.. అమ్మకు చికిత్స అందించిన వివరాలను షీల్డ్ కవర్‌లో కోర్టుకు సమర్పించేందుకు అపోలో రెడీ అయిపోయింది. ఈ నేపథ్యంలో తమిళనాట అమ్మ ఆత్మ తిరుగుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది. నెచ్చెలి శశికళపై కోపంతో అమ్మ ఆత్మ ఆస్పత్రి వద్ద.. సమాధి వద్ద తిరుగుతుందని ప్రచారం జరుగుతోంది. అమ్మ అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారం జరగకపోవడంతో అమ్మ ఆత్మ శాంతించలేదని ఇప్పటికే ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. 
 
అలాగే రాజకీయాల్లోకి రానని.. అన్నాడీఎంకే పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోనని ప్రమాణం చేసిన శశికళ మాట తప్పడంతో జయమ్మ కోపం వచ్చిందని.. అందుకే ఆమె ఆత్మ తిరుగాడుతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే అమ్మ ఆత్మను పోలిన ఫోటోలు మార్ఫింగ్ సౌజన్యమేనని మరికొందరు నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు.