గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 31 జులై 2018 (15:38 IST)

కరుణలో ఆ విషయం నాకు బాాగా నచ్చింది.. చెప్పిందెవరో తెలుసా? జయలలిత

డీఎంకే పార్టీ చీఫ్ కరుణానిధి అనారోగ్యం పాలై చెన్నై కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కరుణ ఆరోగ్యంపై ప్రస్తుతం తమిళనాట పెద్ద చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో డీఎంకే నేత కరుణలో నచ్చిన అంశ

డీఎంకే పార్టీ చీఫ్ కరుణానిధి అనారోగ్యం పాలై చెన్నై కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. కరుణ ఆరోగ్యంపై ప్రస్తుతం తమిళనాట పెద్ద చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో డీఎంకే నేత కరుణలో నచ్చిన అంశాన్ని దివంగత అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.


ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమిళనాట డీఎంకే-అన్నాడీఎంకే నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటిది కరుణలో ఓ విషయం తనకు నచ్చిందని దివంగత మాజీ సీఎం జయలలిత చెప్పారు. 
 
కరుణ గత నాలుగు రోజుల పాటు అనారోగ్యంతో బాధపడుతూ.. కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పలువురు నేతలు ఆస్పత్రిలో పరామర్శిస్తున్నారు. ఇంకా డీఎంకే కార్యకర్తలు కావేరీ ఆస్పత్రి వద్ద కరుణ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో వేచి చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో కరుణకు రాజకీయ శత్రువుగా పిలువబడే జయలలిత ఆయన గురించి చెప్పిన కొన్ని ఆసక్తికర అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
కరుణ లేని రాజకీయ రంగంలో తాను వుండనని.. తనకు ధీటైన రాజకీయ నేత ఆయనేనని చెప్పుకొచ్చారు. కరుణ లేని రాజకీయ రంగంలో తాను భాగం కాబోనని తేల్చిచెప్పారు. కరుణ కోసమే తనకు ఇష్టం లేని రాజకీయ రంగంలోకి అడుగుపెట్టానని ఆ ఇంటర్వ్యూలో తెలిపారు.

అలాగే కరుణలో నచ్చిన అంశం ఏంటంటే.. ఎంజీఆర్ 13 సంవత్సరాల పాటు రాజకీయాల్లో రాణిస్తున్న కాలంలో.. ఆ 13 సంవత్సరాలు.. డీఎంకే అధికారంలో లేకపోయినా.. ఆ పార్టీని కాపాడిన విధానం ఇష్టమని తెలిపారు. ఇంకా కరుణలో విలేకరులతో మాట్లాడేటప్పుడు అనూహ్యంగా విసిరే సెటైర్లు, టైమింగ్‌తో కూడిన సమాధానాలు ఇవ్వడం ఇష్టమని చెప్పారు.