1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 17 జూన్ 2021 (11:09 IST)

ప్రముఖ నిర్మాత రూ.10లక్షల విరాళం- సీఎం స్టాలిన్‌ను కలిసి చెక్కు అందజేత

కరోనా సెకండ్ వేవ్ వలన ప్రజల జీవన విధానం అస్తవ్యస్తంగా మారింది. కొందరు ఉపాధి కోల్పోయి తిండి దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వారికి అండగా ఉండేందుకు సెలబ్రిటీలు భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే రజనీకాంత్, సూర్య, శంకర్,మురుగదాస్‌, విక్రమ్ వంటి పలువురు ప్రముఖులు తమిళనాడు సీఎం సహాయనిధికి విరాళాలు అందిచారు.
 
తాజాగా ప్రముఖ సినీ నిర్మాత కలైపులి ఎస్‌.థాను కరోనా నివారణ నిధికి రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలసి చెక్కు అందించారు. సీఎంను అభినందిస్తూ ప్రశంసా పత్రాన్ని జోడించారు. కరోనా కాలంలో సీఎంగా బాధ్యతలు చేపట్టి నెల రోజుల పాలన విజయవంతంగా పూర్తి చేశారని, వేగవంతమైన చర్యలు, వివేకమంతమైన నిర్ణయాలు, అవిశ్రాంతి కార్యాచరణలు దేశాన్ని తిరిగి చూసేలా చేస్తున్నాయని కొనియాడారు.