శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 21 జులై 2014 (14:15 IST)

ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలి: అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి

ఢిల్లీ అసెంబ్లీని రద్దు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రివాల్ కోరారు. గత ఎన్నికల్లో 70 సీట్ల ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో అసెంబ్లీ రద్దు ఆలస్యం కావడంతో తమ శాసన సభ్యులను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, వారికి డబ్బు ఎరగా వేస్తున్నారన్నారు. తమ శాసన సభ్యులకు బీజేపీ భారీ ఎత్తున డబ్బు ముట్టచెప్పేందుకు ప్రయత్నిస్తోందనే విషయాన్ని జంగ్ దృష్టికి కేజ్రివాల్ తీసుకువచ్చారు.  
 
జంగ్‌తో భేటి అనంతరం.. శాసన సభ్యులను లొంగదీసుకునేందుకు రాజకీయ బేరసారాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ రద్దు ఆలస్యం చేయవద్దని జంగ్‌కు తెలిపానని కేజ్రివాల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అయితే తన ప్రశ్నకు జంగ్ వద్ద సరియైన సమాధానం లభించలేదని కేజ్రివాల్ తెలిపారు.