తల్లిదండ్రులతో కలిసి బెంగళూరు వెళ్లిన కేజ్రీవాల్..!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఆయన గత కొన్ని రోజులుగా హై బ్లడ్ షుగర్, ఎడతెరిపిలేని దగ్గుతో బాధపడుతున్నారు. కేజ్రీవాల్ అనారోగ్యాన్ని గమనించిన ప్రధాని మోడీ బెంగళూరులోని ప్రకృతి వైద్యుని సంప్రదించాల్సిందిగా సూచించిన సంగతి తెలిసిందే.
ఆయన తల్లిదండ్రులతో కలసి ఘజియాబాద్లోని తన నివాసం నుండి గురువారం ఉదయం బయలు దేరారు. పది రోజులపాటు కేజ్రీవాల్ బెంగళూరు లో ఉంటారు. దీంతో ఆయన స్థానంలో ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా రోజువారీ ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వర్తించనున్నారు.
కాగా గత ఢిల్లీ ఎన్నికలు, తీవ్రమైన ఒత్తిడి కారణంగా ఆయనకు షుగర్ బాగా పెరిగిందని, గత పన్నెండు రోజులుగా 300 స్థాయి నుండి తగ్గడం లేదని, ఇన్సులిన్ తీసుకున్నప్పటికీ కంట్రోల్ కాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని కేజ్రీవాల్ సన్నిహిత వర్గాల సమాచారం.