శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 22 నవంబరు 2017 (11:02 IST)

అద్దె చెల్లించాల్సిందే... లతా రజినీకాంత్‌కు చుక్కెదురు

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ విద్యా సంస్థలతో పాటు.. ఓ ట్రావెల్ సంస్థను కూడా నడుపుతోంది. ఈ రెండు కూడా అపుడపుడూ వివాదాల్లో చిక్కుకుంటున్నాయి.

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ విద్యా సంస్థలతో పాటు.. ఓ ట్రావెల్ సంస్థను కూడా నడుపుతోంది. ఈ రెండు కూడా అపుడపుడూ వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. తాజాగా ట్రావెలర్స్ సంస్థ దుకాణం అద్దె పెంపు వ్యవహారంలో ఆమెకు కోర్టులో చుక్కెదురైంది. చెన్నై నగర పాలక సంస్థ నిర్ణయించిన అద్దెను చెల్లించాల్సిందేనంటూ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
చెన్నై కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో భవన సముదాయాలలోని ఓ గదిని అద్దెకు తీసుకుని ట్రావెలర్స్‌ సంస్థను నడుపుతున్నారు. కొన్నేళ్లుగా ఆ దుకాణానికి నెలకు రూ.3702లను కార్పొరేషన్‌కు అద్దెగా చెల్లిస్తూవచ్చారు. గత జూన్‌లో కార్పొరేషన్‌ ఆ దుకాణం ఉన్న గది అద్దెను రూ.21,160లకు పెంచింది. ఈ అద్దె పెంపును సవాలు చేస్తూ కార్పొరేషన్‌కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్‌ వేశారు. 
 
ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి వైద్యనాథన్‌ విచారణ జరిపి అద్దెను రూ.21160గా ఖరారు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు 92 ప్రకారం ప్రతి తొమ్మిదేళ్లకు ఒకసారి అద్దెకిచ్చిన కార్పొరేషన్‌ భవనాల అద్దెను పెంచాల్సి ఉందని, లతా రజనీకాంత్‌ నడుపుతున్న ట్రావెలర్స్‌ సంస్థ అద్దెను కూడా ఆ చట్టం ప్రకారంమే చెల్లించాల్సిందని స్పష్టం చేశారు.