1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 24 జులై 2017 (10:54 IST)

ప్రేయసిని గదికి తీసుకొచ్చిన ప్రియుడు... వారు చూశారనీ 11 సార్లు కత్తితో పొడిచాడు.. ఎందుకని?

ప్రియురాలితో ఏకాంతంగా గడిపేందుకు తన గదికి తీసుకొచ్చిన ప్రియుడు... ఆ తర్వాత గది తలుపులు వేశాడు. ఇంతలో అనుకోని పరిణామం ఎదురైంది. ఓ కిటికీలోనుంచి ప్రియురాలి తల్లిదండ్రులు చూశారు. దీంతో ఖంగుతున్న ప్రియుడు

ప్రియురాలితో ఏకాంతంగా గడిపేందుకు తన గదికి తీసుకొచ్చిన ప్రియుడు... ఆ తర్వాత గది తలుపులు వేశాడు. ఇంతలో అనుకోని పరిణామం ఎదురైంది. ఓ కిటికీలోనుంచి ప్రియురాలి తల్లిదండ్రులు చూశారు. దీంతో ఖంగుతున్న ప్రియుడు... ప్రియురాలిని 11 సార్లు విచక్షణా రహితంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసాలో ఇద్దరూ యువతీ యువకులు ప్రేమించుకున్నారు. అయితే, ప్రియురాలితో ఏకాంతంగా గడపాలని భావించిన ప్రియుడు.. ఆమెను తన గదికి ఎవరూ చూడకుండా తీసుకొచ్చారు. ఇంతలో ఆ యువతి కుటుంబీకులు గది కిటికీలు తెరిచి వారిని చూశారు. దీంతో భయంతో బెదిరిపోయిన ప్రియుడు... పక్కనే ఉన్న చాకుతో ఆమెను 11 సార్లు విచక్షణా రహితంగా పొడిచి హత్యచేశాడు. 
 
తర్వాత తానూ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అతని ప్రయత్నం విఫలమైంది. ఈ ఘటనపై దౌరా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. గాయపడిన యువకునికి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.