శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 మార్చి 2015 (16:12 IST)

అమ్మ కోసం యాగాలు.. పాలక్కాడ్ నుంచి ఐదు ఏనుగులు!

తమిళనాడు మాజీ సీఎం జయలలిత కోసం యాగాలు జరుగుతున్నాయి. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి బెయిలు మీద ఉన్న తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను తమిళ తంబిలు మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారట. అనుకోవడమే కాదు...?, ఈ విషయంలో సాయం చేయమని వారు దేవుడినే ప్రార్థిస్తున్నారు. జయలలిత మరోమారు సీఎం పీఠంపై ఆసీనులు కావాలని కోరుతూ అన్నాడీఎంకే కార్యకర్తలు భారీ యాగాలు చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కోయంబత్తూరులో దాదాపు రెండు గంటల పాటు మహా గజ పూజ యాగాన్ని నిర్వహించారు. ఈ పూజ కోసం వారు పాలక్కాడ్ నుంచి ఏకంగా ఐదు ఏనుగులను కూడా తెప్పించారు. ఏనుగుల సాక్షిగా జరిగిన ఈ యాగంలో తమిళనాడు పురపాలక శాఖ మంత్రి వేలుమణి, నగర మేయర్ రాజ్ కుమార్ లతో పాటు అన్నాడీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాలుపంచుకున్నారట. మరి వారి కల నెరవేరుతుందో, లేదో వేచి చూడాల్సిందే.