బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 14 జులై 2017 (09:49 IST)

పత్రికల కవరేజీపై మార్గదర్శకాలుండాలి.. బాధితుల పేర్లు బహిర్గతం చేస్తారా?

కేరళ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న సినీనటి లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి పత్రికల కవరేజీపై మార్గదర్శకాలు రూపొందించాలని కేరళ రాష్ట్ర మహిళా జర్నలిస్టులు విన్నవించారు. కవరేజీలపై మార్గదర్శకాలను రూపొంద

కేరళ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న సినీనటి లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి పత్రికల కవరేజీపై మార్గదర్శకాలు రూపొందించాలని కేరళ రాష్ట్ర మహిళా జర్నలిస్టులు విన్నవించారు. కవరేజీలపై మార్గదర్శకాలను రూపొందించి.. వాటిని అమలు చేయాలని మహిళా జర్నలిస్టులు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. లైంగికవేధింపులు, అత్యాచారాల బారిన పడిన మహిళల ఘటనల గురించి పత్రికలు, టీవీల్లో ఇచ్చేటప్పుడు వారి పేర్లు బహిర్గతం చేయకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. 
 
లైంగిక నేరాల కవరేజీపై అమలులో ఉన్న నిబంధనలు అమలు అయ్యేలా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీలు చర్యలు తీసుకోవాలని కోరారు. లైంగికదాడికి పాల్పడిన బాధితురాలి పేరును వెల్లడిస్తే అలాంటి పత్రికలు, వ్యక్తులపై ఐపీసీ సెక్షన్ 228 ఏ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవచ్చునని చట్టం చెప్తుందని గుర్తు చేశారు. ఈ విధానాన్ని తప్పనిసరి చేయాలన్నారు.