1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 సెప్టెంబరు 2019 (11:38 IST)

తండ్రితో పాటు 30 మంది స్నేహితులు.. 12ఏళ్ల బాలికపై రెండేళ్ల పాటు..? లీవిస్తే చాలు..?

కేరళలో తండ్రి అనుమతితో.. అతడి స్నేహితులు 30 మంది 12ఏళ్ల బాలికపై రెండేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మలప్పురం, సెల్లేరి ప్రాంతానికి చెందిన ఏడో తరగతి చదువుతున్న బాలిక.. వరుసగా స్కూలుకు సెలవులు పెట్టేది.
 
దీన్ని గమనించిన బాలిక క్లాస్ టీచర్.. పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఆపై ఈ వ్యవహారంపై ఆరా తీసేందుకు పాఠశాల యాజమాన్యంతో పాటు శిశు సంక్షేమ శాఖకు చెందిన అధికారులు రంగంలోకి దిగారు. ఆ సందర్భంగా ఆ బాలిక వద్ద జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ బాలిక చెప్పిన విషయాలు విని అధికారులు షాకయ్యారు. 
 
గత రెండేళ్ల పాటు ఆ విద్యార్థినిపై తండ్రితో పాటు అతడి స్నేహితులు చాలామంది లైంగికంగా దాడి చేశారని తెలియవచ్చింది. పాఠశాల సెలవుల సందర్భంగా ఆ బాలిక ఇంటికి వచ్చే పురుషుల సంఖ్య అధికమని తెలిసింది. 
 
దాదాపు 30 ఏళ్ల దాటిన వ్యక్తులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ జాతీయ దినపత్రిక తెలిపింది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్కో చట్టం కింద ఇద్దరిని అరెస్ట్ చేశారు. విచారణను వేగవంతం చేశారు. బాధితురాలిని శిశు సంక్షేమ కేంద్రానికి పంపారు.