మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (09:46 IST)

కొడుకు పుట్టిన రోజు పార్టీకిరాని నానమ్మను హతమార్చిన మనవడు

హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. కొడుకు పుట్టాడన్న ఆనందంలో చేసుకుంటున్న పార్టీకి రాలేదన్న కోపంతో ఓ వ్యక్తి... తన నానమ్మను హత్య చేశాడు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఫతేబాద్‌ పట్టణానికి చెందిన రామ్‌దేవి (70), రామ్‌ అవతార్‌ అనే దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఆస్తి పంపకాల విషయంలో విభేదాలు తలెత్తడంతో కొడుకులకు దూరంగా ఉంటున్నారు. 
 
ఈ క్రమంలో తనకు కుమారుడు పుట్టాడని, ఇపుడైనా ఇంటికి రావాలని నానమ్మ - తాతలను మనవడు విక్కీ ఆహ్వానించాడు. పైగా, తమకు కుమారుడు పుట్టిన ఆనందంలో పార్టీ జరుపుకుంటున్నామనీ, ఈ పార్టీకి వచ్చి ఆనందించాలని కోరాడు. అయితే, తాము తాము వచ్చే ప్రసక్తే లేదని నానమ్మ రామ్‌దేవి స్పష్టం చేసింది. 
 
దీంతో కోపోద్రిక్తుడైన విక్కీ.. నానమ్మ రామ్‌దేవి ఇంటికి వచ్చి ఐరన్‌ రాడ్డుతో ఆమె తలను పగులగొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా, మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలో రామ్‌ అవతార్‌ తన మనుమడు, కోడలు, కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
కేసు నమోదు చేసిన పోలీసులు.. విక్కీ అతడి తల్లిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడి తండ్రి పరారీలో ఉన్నాడని, త్వరలోనే అతడిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తామని వెల్లడించారు.