1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pyr
Last Modified: సోమవారం, 27 ఏప్రియల్ 2015 (06:49 IST)

‘మోడీ జీ బహుత్ ధన్యవాద్..’ మనీషా కోయిరాల

తాను పుట్టిపెరిగిన దేశం. నేటికీ తన తల్లిదండ్రులు.. అన్నదమ్ములు జీవిస్తున్న దేశం నేపాల్ భూకంపానికి గురికావడం సినీ నటి మనీషా కోయిరాలను కరిగించేశాయి. తన దేశానికి సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన ధన్యవాదలు తెలిపారు. తాను కూడా విమాన సర్వీసులు ప్రారంభం కాగానే అక్కడకు వెళ్లతానిని చెప్పారు. 
 
నేపాల్‌లో తన తల్లిదండ్రులు, స్నేహితుల క్షేమం పట్ల ఆందోళనగా ఉందన్నారు. ఈ క్షణం వారితో ఉండాల్సి ఉందని, విమాన సేవలు ప్రారంభం కాగానే అక్కడకు బయలుదేరుతానన్నది ఈ బ్యూటీ. 
 
నేపాల్ బాధ తన బాధగానే బావిస్తానని మోడీ అనడం తన మనసుకు తాకిందని ఆమె పేర్కొన్నారు. బాధ్యతగా వ్యవహరిస్తున్నందని మీడియాను కూడా ఆకాశానికెత్తింది ఈ అమ్మడు. తన దేశం సంక్షోభంలో ఉన్నదని, ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తమకవసరమని ఆమె పేర్కొన్నారు.