దండకారణ్యంలో మావో సమావేశం నిజమేనా?
దండకారణ్యంలో మావోయిస్టు అగ్రనాయకత్వం సమావేశయ్యారని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని చుట్టు ముట్టారని, మావోయిస్టు అగ్రనాయకుల ఇంటర్వ్యూల కోసమంటూ మీడియా ప్రతినిధులు కొందరు అక్కడకి వెళ్లారంటూ ఆదివారం ఛత్తీస్గఢ్లో జోరుగా ప్రచారం జరిగింది.
మరోవైపు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి రామన్న ఈ సమావేశానికి ప్రాతినిథ్యం వహించారని ప్రచారం జరిగింది. ఈ విషయమై బస్తర్ రేంజ్ పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ తమ బలగాలు దండకారణ్యంలో కొద్ది కాలంగా గాలింపులు చేపడుతున్న విషయం వాస్తవమేనన్నారు. కానీ మావోయిస్టు అగ్రనాయకత్వాన్ని చుట్టుముట్టినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.