శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 22 జూన్ 2017 (11:53 IST)

ఆ రోడ్డులో వ్యభిచారిణుల ఇష్టారాజ్యం... రాత్రివేళ మహిళలకు భద్రత కరవు

దేశ రాజధాని న్యూఢిల్లీ అనేక నేరాలకు ఘోరాలకు అడ్డగా మారిపోయింది. ముఖ్యంగా ఢిల్లీలోని ప్రధాన రహదారుల్లో ఎంజీ రోడ్డు (మెహ్రౌలీ-గుర్గామ్) రోడ్డు వ్యభిచారిణులకు అడ్డాగా మారిపోయింది. దీంతో ఈ రహదారి రాత్రిపూ

దేశ రాజధాని న్యూఢిల్లీ అనేక నేరాలకు ఘోరాలకు అడ్డగా మారిపోయింది. ముఖ్యంగా ఢిల్లీలోని ప్రధాన రహదారుల్లో ఎంజీ రోడ్డు (మెహ్రౌలీ-గుర్గామ్) రోడ్డు వ్యభిచారిణులకు అడ్డాగా మారిపోయింది. దీంతో ఈ రహదారి రాత్రిపూట మహిళలకు ఏమాత్రం సురక్షితం కాదని తేలింది. 
 
సూర్యాస్తమయం కాగానే ఎంజీరోడ్డుపై వ్యభిచారిణులు సంచరిస్తున్నారని, జూదం కూడా జోరుగా సాగుతోందని ఇద్దరు విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రివేళ ఈ రోడ్డుపై పోలీసులు కనిపించరని... కేవలం పోలీసు వాహనం మాత్రం చక్కర్లు కొడుతుందని తగినంతమంది పోలీసులు లేక ఈ రోడ్డుపై అసాంఘీక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయని పలువురు వాపోయారు. 
 
ఈ ప్రాంతంలో చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఎక్కువగా సాగుతున్నందున... కుటుంబసభ్యులతో ఈ ప్రాంతంలో తిరగలేమని మరో వ్యక్తి స్పష్టం చేశారు. ప్రతిరోజూ పీకల దాకా మద్యం తాగి మత్తులో తూలుతుంటారని సహారా మాల్ భద్రతాధికారి దిలీప్ సింగ్ రాథోడ్ చెప్పారు. మద్యం తాగిన మత్తులో అసాంఘీక కార్యకలాపాలు సాగుతున్నందున రాత్రివేళ తాము ఎంజీరోడ్డుపై అడుగు పెట్టలేకపోతున్నామని పలువురు మహిళలు వాపోతున్నారు.