1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 14 జూన్ 2017 (15:30 IST)

మైనర్ బాలికను గన్‌తో బెదిరించి వారం పాటు అత్యాచారం.. గది తలుపు పెట్టుకుని?

దేశ రాజధాని నగరం ఢిల్లీలో మహిళలకు రోజు రోజుకు రక్షణ కరువవుతుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా.. కామాంధులు మహిళలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా తుపాకీతో బెదిరించి ఓ మైనర్ బాలికపై వారం రోజులుగా ఓ వ్యక్తి అ

దేశ రాజధాని నగరం ఢిల్లీలో మహిళలకు రోజు రోజుకు రక్షణ కరువవుతుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా.. కామాంధులు మహిళలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా తుపాకీతో బెదిరించి ఓ మైనర్ బాలికపై వారం రోజులుగా ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సమయపూర్ బద్లీ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన పక్కింటి అమ్మాయిని తుపాకీతో బెదిరించాడు. 
 
తనకు లొంగకపోతే చంపేస్తానని బెదిరించాడు. అలా గత వారం రోజుల నుంచి బాలికపై అతను పలుమార్లు అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే... చంపేస్తానని ఆ వ్యక్తి బెదిరించాడు. దీంతో కొన్నాళ్ల పాటు భరించినా.. అనూహ్యంగా షాక్‌కు గురైంది. ఓ రోజంతా గది తలుపు పెట్టుకుని బాలిక ఏడుస్తూనే ఉండిపోయింది. ఏం జరిగిందో చెప్పమని తల్లిదండ్రులు ఎంతలా అడిగినా చెప్పడానికి ఒప్పుకోలేదు. 
 
ఇదే క్రమంలో బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఆమె తల్లిదండ్రులు సోమవారం నాడు ఆసుపత్రికెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు.. ఆమె అత్యాచారానికి గురైనట్లు నిర్దారించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.