శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 2 ఆగస్టు 2018 (15:40 IST)

బాలికను కాటేసిన పినతండ్రి... సుఖపెట్టి.. సుఖపడమని చెప్పిన తల్లి...

సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దివాస్ జిల్లాలో జరిగింది. కామంతో కళ్లుమూసుకునిపోయిన ఓ మానవ మృగం.. కుమార్తె వరుసయ్యే 14 యేళ్ల బాలిక కాటేశాడు.

సభ్యసమాజం తలదించుకునే సంఘటన ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దివాస్ జిల్లాలో జరిగింది. కామంతో కళ్లుమూసుకునిపోయిన ఓ మానవ మృగం.. కుమార్తె వరుసయ్యే 14 యేళ్ల బాలిక కాటేశాడు. ఫలితంగా ఆ బాలిక గర్భంధరించింది. ఈ సంఘటనలో బాలిక తల్లికూడా తనవంతు సహకారం అందించడం గమనార్హం. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
దివాస్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలిక తన తల్లితో కలిసి పినతండ్రి విజయ్ బైరాగితో కలిసి ఉంటున్నారు. ఆ బాలికపై కన్నేసిన పినతండ్రి.. ఇంట్లో ఎవరూ లేనిసమయంలో పశువులా మీదపడి కామవాంఛ తీర్చుకున్నారు. ఆ మరుసటిరోజు నుంచి ప్రతి రోజూ అత్యాచారం చేయసాగాడు. అలా గత ఐదు నెలలుగా ఆ కామాంధుడికి దాసోహమైపోయింది. ఈ విషయం తెలుసుకున్న కన్నతల్లి కూడా ఆ కామాంధుడిని మందలించాల్సిపోయి... కుమార్తెనే ప్రోత్సహిస్తూ, వెళ్లి సుఖపెట్టి.. సుఖపడు అంటూ ప్రోత్సహించింది. 
 
ఈ క్రమంలో బాలిక అనారోగ్యానికి గురైంది. వాంతులు చేసుకోవడంతో ఆమెను బుధవారం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు బాలికను పరిశీలించగా, మూడు నెలల గర్భవతి అని తేలింది. ఈ విషయాన్ని వైద్యులు.. పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు విజయ్ బైరాగిని అరెస్టు చేశారు.