శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2017 (15:36 IST)

తిరువనంతపురంలో కోతుల గోల.. తాళలేక 56ఏళ్ల మహిళ ఆత్మహత్య

కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో కోతుల గోల భరించలేక 56 ఏళ్ల మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. పుష్పలత అనే మహిళ ఏడాది క్రితం భర్తను కోల్పోయింది. కూలి పని చేసుకుంటూ కొడుకును, క

కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో కోతుల గోల భరించలేక 56 ఏళ్ల మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. పుష్పలత అనే మహిళ ఏడాది క్రితం భర్తను కోల్పోయింది. కూలి పని చేసుకుంటూ కొడుకును, కుమార్తెను పోషించుకుంటూ వచ్చింది. ఓ చిన్న రేకుల షెడ్డులో వారి నివాసం. కష్టపడి సంపాదించిన కూలీ డబ్బుతో పిల్లల కోసం ఆహారం వండిపెడితే అది కాస్తా కోతుల గుంపు ఎత్తికెళ్లిపోయేది.. ఇలా రోజూ కోతులతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ మహిళ విసిగిపోయింది. 
 
ఆహారంతో పాటు ఇంట్లోని వస్తువుల్ని, బట్టల్ని కూడా నాశనం చేసేవి. ఇంటిపై కప్పు సరిగా లేకపోవడంతో కోతుల గుంపు దగ్గర్లోని రబ్బరు చెట్ల నుంచి లోపలికి ప్రవేశించి వారికి నరకం చూపించేవి. వాటి బాధపడలేక తీవ్ర మనస్తాపం చెందిన పుష్పలత ఆత్మహత్యకు పాల్పడింది. కోతుల బాధతో ఇరుగు పొరుగు వారు ఖాళీ చేసి వెళ్లిపోయారు. కానీ పుష్పలత కుటుంబం మాత్రం ఆర్థిక స్తోమత లేకపోవడంతో అదే ఇంట్లో గడపాల్సి వచ్చిందని పోలీసులు చెప్తున్నారు.