శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2014 (12:33 IST)

గోవా గవర్నర్‌గా మృదులా సిన్హా ప్రమాణ స్వీకారం!

గోవా గవర్నర్‌గా ప్రసిద్ధ నవలా రచయిత, సీనియర్ బీజేపీ నాయకురాలు మృదులా సిన్హా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ హయాంలో గోవా గవర్నర్‌గా నియమితులైన బీవీ వాంఛూ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో మృదులను కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేయడంతో రాష్ట్రపతి నియామక ఉత్తర్వులు జారీ చేశారు. 
 
ఈ క్రమంలో బొంబాయి హైకోర్టు చీఫ్ జస్టిస్ మోహిత్ షా ఆదివారం మృదులతో గవర్నర్‌గా ప్రమాణం చేయించారు. కాగా కేరళ గవర్నర్ పదవికి మాజీ ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.