1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 22 మే 2017 (16:47 IST)

ఆకలి తీర్చుకునేందుకు చోరీ.. చెప్పుల దండ వేసి, నగ‍్నంగా ఊరేగించారు...

దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఇద్దరు మైనర్ల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ముంబైలోని ఉల్హస్ నగర్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉల్హస్ నగర్‌లోని షాపులోంచి ఇద్దరు మైనర్లు ఆకలి బాధ తట్

దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఇద్దరు మైనర్ల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ముంబైలోని ఉల్హస్ నగర్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉల్హస్ నగర్‌లోని షాపులోంచి ఇద్దరు మైనర్లు ఆకలి బాధ తట్టుకోలేక తినుబండారాలను తిన్న పాపానికి షాపు యజమాని అవమానకరంగా.. అమానుషంగా ప్రవర్తించారు. బాలుర మెడలో చెప్పుల దండ వేసి, నగ‍్నంగా ఊరేగించారు.   
   
ఎనిమిది, తొమ్మిదేళ్ల సంవత్సరాల ఇద్దరు అబ్బాయిలు మెహమూద్ పఠాన్ (62) దుకాణంలోని చక్కిలాల ప్యాకెట్‌ను దొంగలించారు. దీన్ని గమనించిన పఠాన్‌, అతని ఇద్దరు కొడుకులు ఇర్ఫాన్ (25), సలీ(20)  వీళ్లపై విరుచుకుపడ్డారు. తీవ్రంగా కొట్టారు. ఆపై అరగుండు కొట్టించి.. మెడలో చెప్పుల దండ వేసి.. వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. ఇంత అమానుష చర్య జరుగుతున్న ఎవ్వరూ పట్టించుకోలేదు. 
 
అయితే ఈ దృశ్యాలను స్థానికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్‌ చేయడంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.