శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 2 మార్చి 2019 (19:08 IST)

పక్కింటి అబ్బాయి.. పదేళ్ల బాలికపై 4నెలలుగా అత్యాచారం.. బాలిక గర్భవతి

వయోబేధం లేకుండా మహిళలపై, బాలికలపై అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పదేళ్ల బాలికపై 12 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో చిన్నారి గర్భం దాల్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్గర్‌ జిల్లాకు చెందిన ఓ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితురాలు, నిందితుడు ఇద్దరూ పక్కింటివారే కావడంతో ఈ దురాగతం చోటుచేసుకుంది. 
 
బాలుడు నాలుగు నెలలుగా బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు. కానీ కడుపులో నొప్పి కారణంగా బాలిక తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు బాలిక గర్భంతో వుందన్న విషయం తెలుసుకుని షాకయ్యారు. దీనిపై తల్లిదండ్రులకు జరిగిన అన్యాయాన్ని చెప్పడంతో వారు బోరున విలపించారు. దీంతో బాధిత బాలిక తల్లిదండ్రులు బాలుడిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోక్సో చట్టం కింద బాలుడిపై కేసు నమోదు చేశారు. ఇంకా బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.