శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 22 డిశెంబరు 2017 (13:52 IST)

న్యాయవాది కాదు.. కామాంధుడు.. 15 యేళ్ల బాలికను పెళ్లాడాడు...

బాల్య వివాహాల అడ్డుకట్టకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే సమాజంలో జరిగే బాల్య వివాహాలను అడ్డుకోవాల్సిన ఓ న్యాయవాదే స్వయంగా 15 యేళ్ల బాలికను పెళ్లి చేసుకోవడమేకాకుం

బాల్య వివాహాల అడ్డుకట్టకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాలైన చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే సమాజంలో జరిగే బాల్య వివాహాలను అడ్డుకోవాల్సిన ఓ న్యాయవాదే స్వయంగా 15 యేళ్ల బాలికను పెళ్లి చేసుకోవడమేకాకుండా తనకు పడక సుఖం ఇవ్వాలంటూ లైంగికంగా చిత్రహింసలకు గురిచేశాడు. ఈ ఘటన ముంబైలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబైకి చెందిన ఓ న్యాయవాది (53) స్థానిక హైకోర్టులో న్యాయవాద వృత్తిలో రాణిస్తున్నాడు. ఈయనకు 2014లో భార్య చనిపోయింది. అదేసమయంలో 15 యేళ్ల వయసున్న కుమార్తె కూడా ఉంది. అయితే భార్య చనిపోవడంతో తన కుమార్తె వయసుండే బాలికపై కన్నేశాడు. ఆ బాలిక గురించి ఆరా తీశాడు. ఆర్థికస్థితిగతులను తెలుసుకున్నాడు. ఆ బాలిక తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఇదే మంచి తరుణమని భావించి, ఓ మధ్యవర్తి ద్వారా తన పెళ్లి ప్రతిపాదనను చేరవేశాడు. పైగా, రూ.లక్షలతోపాటు ఐదు ఎకరాల భూమి ఇస్తానని ఆశ చూపాడు.
 
దీంతో న్యాయవాదితో బాలిక పెళ్లి చేసేందుకు అమ్మమ్మ, తాత అంగీకరించారు. ఈ పెళ్లి అమ్మాయికి, ఆమె తండ్రికి ఇష్టం లేదు. తాను ఇప్పుడు తొమ్మిదో తరగతి చదువుతున్నానని.. ఉన్నత చదువులు చదవాలని ఉందని బాలిక తెగేసి చెప్పింది. ఈ క్రమంలో ఉన్నత చదువులు చదివిస్తానని బాలికను లాయర్ నమ్మించాడు. బలవంతంగానే 2015, ఏప్రిల్ 21వ తేదీన ఆ అమ్మాయిని న్యాయవాది.. బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. 
 
ఇక అప్పటి నుంచి ఆ మైనర్ భార్యకు నరకం మొదలైంది. ఒక భార్యగా చూడకుండా వేశ్యగా చూడటం మొదలుపెట్టాడు. తీవ్రమైన చిత్ర హింసలకు గురిచేశాడు. న్యాయవాది హింస భరించలేని ఆ అమ్మాయి ఈ నెల 13న పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. న్యాయవాదిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఆ న్యాయవాదిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.