గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (16:32 IST)

మోడీని ఎంపీ అభ్యర్థిగా నామినేట్ చేసిన కాటికాపరి కుటుంబ సభ్యుడు

లోక్‌సభ సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన తన నామినేషన్ పత్రాలను శుక్రవారం సమర్పించారు. గత ఎన్నికల్లో వారణాసితోపాటు వడోదరాలో పోటీ చేసి గెలుపొందారు. ఫలితాల తర్వాత వడోదరా స్థానానికి రాజీనామా చేసి, వారణాసి స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించారు. 
 
ఈ 17వ లోక్‌సభ ఎన్నికల్లో ఆయన వారణాసి నుంచే పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా, మోడీని ఎంపీ అభ్యర్థిగా ప్రతిపాదించినవారిలో ఓ కాటికాపరి కుటుంబ సభ్యుడు కూడా ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. వారణాసిలోని ప్రఖ్యాత మణికర్ణిక ఘాట్ వద్ద దహనసంస్కారాలు నిర్వహించే కుటుంబానికి చెందిన ఓ వ్యక్తికి నరేంద్ర మోడీ తనను నామినేట్ చేసే అవకాశం కల్పించారు. 
 
అంతేకాగాకుండా, ఆయన పేరును ప్రతిపాదించినవారిలో ఓ వాచ్‌మన్, ఓ స్కూలు ప్రధానోపాధ్యాయురాలు, బీజేపీ సీనియర్ నేత కూడా ఉన్నారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు మోడీ స్థానిక కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్డీయే భాగస్వాములైన ప్రకాశ్ సింగ్ బాదల్, అన్నపూర్ణ శుక్లా వంటి పెద్దవాళ్లకు మోడీ సనాతన ధర్మం ప్రకారం పాదాభివందనం చేసి నామినేషన్ దాఖలుకు బయల్దేరారు.