శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2015 (10:00 IST)

ఇంద్రాణి ముఖర్జియా నాటకాలాడి బెయిల్ పొందాలని చూస్తోందా?

ఇంద్రాణి ముఖర్జియా నాటకాలాడి బెయిల్ పొందాలని చూస్తోందని జైలు అధికార వర్గాలు అంటున్నాయి. కన్నకూతురినే అత్యంత దారుణంగా హతమార్చి కటకటాలపాలైన ఇంద్రాణి ముఖర్జియా నాటకాలాడి బెయిల్ పొందాలని చూస్తున్నట్లు జైలు అధికార వర్గాలు తెలిపాయి. ఈ దిశగా ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు నేడు ఇంద్రాణి నుంచి కీలక వాంగ్మూలం సేకరించనున్నారు. జైల్లో ఉండగానే తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన జైలు అధికారులు జేజే ఆసుపత్రికి తరలించారు. 
 
మూడు రోజుల చికిత్స అనంతరం ఇంద్రాణి స్పృహలోకొచ్చింది. సోమవారం ఇంద్రాణి ప్రశ్నించిన పోలీసు అధికారులకు ఆమె ఆసక్తికర వాదనను చెప్పింది. తాను ఎలాంటి ఔషధాలు తీసుకోలేదని ఆమె చెప్పిందట. మరి ఉన్నట్టుండి అనారోగ్యానికి ఎలా గురయ్యారని పోలీసులు ఆరా తీశారు. ఈ క్రమంలో పొంతనలేని సమాధానాలు రావడంతో బెయిల్ పొందేందుకే ఆమె నాటకాలాడిందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి.