బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 6 జూన్ 2017 (17:54 IST)

భారతీయులందరూ.. దోసెకే ఓటేశారు.. ఇండియన్ ఫేవరేట్ బ్రేక్ ఫాస్ట్‌గా దోసె..

ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా టిఫిన్ కోసం హోటల్‌కు వెళ్లేవారు రెండో ఆలోచన లేకుండా దోసెనే ఆర్డర్ చేస్తున్నారట. టిఫిన్లపై జరిపిన స్విగ్గీ అనే ఆన్ లైన్ డెలివరీ సంస్థ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో ఈ

భారతీయులందరూ ఆ విషయంలో మాత్రం ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దోసెకే ఓటేశారు. భారతీయుల వంటకాలు రాష్ట్రానికి రాష్ట్రం తేడా వుంటుంది. భాషల పరంగా, ప్రాంతాల పరంగా ఆహారాల పదార్థాలు కూడా మారిపోతాయి. దక్షిణాది వంటకాలకు, ఉత్తరాది వంటకాలకు తేడా వుంటుంది.

దక్షిణాది వారు ఎక్కువగా ఇడ్లీ సాంబారు, దోసె వంటివి తీసుకుంటే.. ఉత్తరాది వారు ఎక్కువ చపాతీ, పుల్కా, దాల్ వంటివి తీసుకుంటారు. అయితే తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో భారతీయుల్లో అత్యధికులు దోసెనే అధికంగా ఇష్టపడుతున్నారు. 
 
ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా టిఫిన్ కోసం హోటల్‌కు వెళ్లేవారు రెండో ఆలోచన లేకుండా దోసెనే ఆర్డర్ చేస్తున్నారట. టిఫిన్లపై జరిపిన స్విగ్గీ అనే ఆన్ లైన్ డెలివరీ సంస్థ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దేశ వ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లోని 12 వేల రెస్టారెంట్లలో టిఫిన్ ఆర్డర్లపై ఈ సంస్థ సర్వే చేసింది. ఇందులో దోసె అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో పోహా, పరోటాలు నిలిచాయి. వారాంతాల్లో దోసెల అమ్మకాలు మరింత పెరుగుతాయని ఆ సర్వేలో వెల్లడి అయ్యింది
 
దోసెలో ప్లెయిన్ దోశ, మసాలా, రవ్వ, ఆనియన్, ఆనియన్ రవ్వ వంటి అనేక రకాలుండటంతో దోసెలను మన భారతీయులు కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, సాంబారు వంటి వాటితో నంజుకుని తెగ లాగిస్తున్నారట. అదన్నమాట సంగతి.