బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (16:10 IST)

దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్యం... మంచి నిర్ణయం తీసుకోండి.. శశి వర్గీయులకు ఓపీఎస్ లేఖ

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం తన వైరివర్గం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గీయులకు ఓ లేఖ రాశారు. అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ

తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం తన వైరివర్గం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గీయులకు ఓ లేఖ రాశారు. అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే ఆయన ఈ లేఖ విడుదల చేశారు. 
 
పార్టీలో వివాదాలు తాత్కాలికమని, మనమంతా ఐక్యంగా ఉండాలని ఎమ్మెల్యేలకు ఆయన పిలుపునిచ్చారు. దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు. పార్టీ విడిపోతుందని ప్రత్యర్థులు చూస్తున్నారని, ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందన్నారు. 
 
అమ్మ అసంపూర్తిగా మిగిల్చిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన లేఖలో తెలిపారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పనులపై దృష్టి పెట్టాలని పన్నీర్ సెల్వం సూచించారు. ఏ పార్టీ మద్దతు, సహకారం లేకుండానే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పన్నీర్ సెల్వం ధీమా వ్యక్తం చేశారు.