బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (15:07 IST)

బాలికను కిడ్నాప్ చేసి.. 28 రోజుల పాటు గ్యాంగ్ రేప్.. నదిలో తోసేశారు..

చిన్నారులపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఒడిశా రాష్ట్రంలోని జైపూర్‌ జిల్లాకు చెందిన ఓ బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు దుండగులు. ఏకంగా 28 రో

చిన్నారులపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఒడిశా రాష్ట్రంలోని జైపూర్‌ జిల్లాకు చెందిన ఓ బాలికపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు దుండగులు. ఏకంగా 28 రోజుల పాటు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆ బాలికను ఆదివారం సాయంత్రం ఖరస్రోస్టా నదిలో తోసేశారు.
 
అయితే నదిలో తోసేసినా ఆ బాలిక ఊపిరిని అరచేతిలో పెట్టుకుని ధైర్యంగా ఊదుకుంటూ ఒడ్డుకు చేరుకుంది. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రంలోని రౌట్రాపూర్ గ్రామానికి చేరుకున్న బాలిక గ్రామస్తుల సాయంతో ప్రాణాలతో బయటపడింది. 
 
గత నెల ఆగస్టు 20వ తేదీన ఆ బాలిక మధుబన్ బజార్లో స్టేషనరీ ఐటమ్స్ కొనుగోలు చేసేందుకుగాను ఇంటి నుంచి బయటికి వచ్చినట్లు గ్రామస్తులకు చెప్పింది. ఆ బాలికను నిందితులు అక్కడి నుండి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత నిర్మానుష్యంగా ఉన్న ఓ ఇంట్లో ఆ బాలికను నిర్భంధించి గ్యాంగ్‌‌రేప్‌కు పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. 
 
ఇంకా ఆదివారం సాయంత్రం ఆ బాలికను నదిలో తోసేశారు. నది నుండి ఆ బాలిక ఈదుకొంటూ ఒడ్డుకు చేరుకొంది. గ్రామస్తుల సహాయంతో ఆ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసు విచారణలో మామనే ఆ బాలికను కిడ్నాప్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.