గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 మే 2017 (11:24 IST)

పతంజలి ఉత్పత్తుల్లో గోమూత్రం ఉపయోగిస్తున్నాం : రాందేవ్ బాబా వెల్లడి

ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సంచలన విషయాన్ని వెల్లడించారు. తమ సారథ్యంలోని పతంజలి సంస్థ తయారు చేసే ఉత్పత్తుల్లో గోమూత్రాన్ని కలుపుతున్నట్టు ఆయన తెలిపారు. తమ సంస్థ మొత్తం 800 ఉత్పత్తులు తయారు చేస్తుం

ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సంచలన విషయాన్ని వెల్లడించారు. తమ సారథ్యంలోని పతంజలి సంస్థ తయారు చేసే ఉత్పత్తుల్లో గోమూత్రాన్ని కలుపుతున్నట్టు ఆయన తెలిపారు. తమ సంస్థ మొత్తం 800 ఉత్పత్తులు తయారు చేస్తుండగా, అందులే కేవలం 8 ఉత్పత్తుల్లో మాత్రమే గోమూత్రాన్ని ఉపయోగిస్తున్నామన్నారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ పతంజలి ఉత్పత్తుల్లో గోమూత్రం కలిపామని తప్పుడు ప్రచారం చేస్తూ ముస్లిమ్‌లను తప్పుదోవ పట్టిస్తున్నారని కాని కేవలం ఐదు రకాల మందుల్లోనే గోమూత్రం కలిపామని ఆయన వివరించారు. 
 
పైగా, గోమూత్రం కలిపిన విషయం మందుల ప్యాకెట్లపై స్పష్టంగా పేర్కొనివుందని, ఇందులో దాచిపెట్టాల్సిన అంశం లేదన్నారు. కేన్సర్ నివారణ కోసం పంచగోయ మందులో గోమూత్రం కలిపామని బాబా రాందేవ్ అంగీకరించారు.