1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (12:52 IST)

సోనియా @ 9.30: పార్లమెంటరీ కమిటీ సమావేశంలో..?

కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ సమావేశానికి వెళ్లిన ఆ పార్టీ అధినేత్రి షాక్ అయ్యారు. నిర్దేశిత సమయం శుక్రవారం ఉదయం 10 గంటలు పార్లమెంటరీ కమిటీ ప్రారంభమవుతుంది. సాధారణంగా సమయపాలనకు ప్రాధాన్యం ఇచ్చే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అరగంట ముందుగానే, అంటే 9.30 గంటలకే సమావేశానికి వచ్చేశారు. అయితే అక్కడే షాక్ తిన్నారు. సమావేశ హాల్లోకి వచ్చిన ఆమె ఒక్కసారిగా అవాక్కయ్యారు.
 
ఎందుకంటే, ఆ హాల్లో సోనియాగాంధీ తప్ప నాయకులెవ్వరూ లేరు. మొత్తం హాలంతా ఖాళీయే. అది చూసి సోనియా నివ్వెరపోయారు. ఏమైందో ఆమెకు అర్థం కాలేదు. దాంతో చేసేదేమీ లేక సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు పార్టీ నాయకులకు తెలిపి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇక అసలు విషయానికొస్తే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా నాయకులెవ్వరికీ సమాచారం అందలేదని తెలిసింది.