1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 మార్చి 2024 (21:34 IST)

ధారావిలో రాహుల్ గాంధీతో ప్రియాంకా గాంధీ.. యాత్రకు ఎండ్ కార్డ్

Rahul Gandhi
Rahul Gandhi
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి  ముంబైలోని ధారవిలో జరిగిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారకమైన దాదర్‌లోని చైత్యభూమి వద్ద యాత్ర ముగిసింది.
 
ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రియాంక మాట్లాడుతూ, "ఈ రోజుతో రాహుల్ గాంధీ చేపట్టిన 6,700 కి.మీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగుస్తుంది.. ఈ దేశంలోని వాస్తవికతను మీకు తెలియజేసేందుకు ఆయన చేపట్టిన ఈ యాత్ర ఈరోజు చాలా ముఖ్యమైనది. 
Rahul Gandhi
Rahul Gandhi
 
ప్రజల అవగాహనపై పదునైన దాడి జరుగుతోంది. దాని గురించి మీ అందరికీ తెలియజేయడానికి రాహుల్ గాంధీ  'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ప్రారంభించాడు. జనవరి 14న అట్టుడుకుతున్న మణిపూర్ నుంచి ప్రారంభమైన యాత్ర 63వ రోజు పొరుగున ఉన్న థానే నుంచి ముంబైలోకి ప్రవేశించింది.