శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 30 మార్చి 2015 (15:26 IST)

రాహుల్‌కు కోర్టు సమన్లు..! మే 8న హాజరుకావాలని ఉత్తర్వులు..!

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, యువ నేత రాహుల్ గాంధీకి మహారాష్ట్రలోని భివాండీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఆర్ఎస్ఎస్ నేత రాజేష్ కుంటే దాఖలు చేసిన పరువు నష్టం కేసులో రాహుల్ కోర్టుకు గైర్హాజరవడంతో కోర్టు సమన్లు ఇచ్చింది. 
 
వ్యక్తిగత కారణాల రీత్యా విచారణకు హాజరుకాలేకపోతున్నారంటూ రాహుల్ న్యాయవాది దాఖలు చేసిన పిటిషణ్‌ను కోర్టు తిరస్కరించింది. మే 8న కోర్టుకు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీచేసింది. కాగా గతేడాది లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆర్ఎస్ఎస్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ రాహుల్‌పై పరువునష్టం కేసు దాఖలైంది.