1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 డిశెంబరు 2020 (21:02 IST)

వార్డు కౌన్సిలర్ నీచపు పని-మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసి..?

మహిళలపై వేధింపులు ఏమాత్రం తగ్గట్లేదు. నేరాలకు పాల్పడే వారిలో మాత్రం పెద్దగా మార్పు రావడం లేదు. తాజాగా రాజస్థాన్‌లోని బర్మర్‌లో ఓ వార్డు కౌన్సిలర్ నీచపు పనికి పాల్పడ్డాడు. బాత్‌రూమ్‌లో ఓ మహిళ స్నానం చేస్తున్న వీడియోలు తీసి.. ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అదేవిధంగా తన స్నేహితుడితో గడపాల్సిందిగా ఆమె ఒత్తిడి తెచ్చాడు. నిందితుడిని కాంతిలాల్‌గా గుర్తించారు. 
 
వివరాల్లోకి వెళితే.. బాల్‌తోరా బాధిత మహిళకు నాలుగేళ్ల కిందట పెళ్లైంది. వార్డు నెంబర్ 16కు చెందిన బీజేపీ కౌన్సిలర్ అయిన కాంతిలాల్ తరుచూ మహిళ ఇంటికి వస్తూ వెళ్లేవాడు. అయితే ఈ క్రమంలోనే బాధిత మహిళ స్నానం చేస్తున్న దృశ్యాలను కాంతిలాల్ ఆమెకు తెలియకుండా వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్ చేశాడు. అనంతరం ఆమెను రేప్ చేశాడు.
 
బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడి మహిళలపై లైంగిక దాడి చేసిన తరువాత కూడా అతడి పైశాచిక ఆనందం తీరలేదు. తన స్నేహితుడైన పాయ్లాకు చెందిన జోద్‌రామ్‌ కూడా గడపాల్సిందిగా కాంతిలాల్ మహిళపై ఒత్తిడి తెచ్చాడు. లేకుంటే వీడియా వైరల్ చేశాడు. ఈ క్రమంలో జోధ్‌రామ్ కూడా బాధిత మహిళపై అత్యచారానికి పాల్పడ్డాడు. ఇలా వీడియోల పేరు చెప్పి కాంతిలాల్ చాలా సార్లు మహిళను రేప్ చేశాడు. 
 
ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని చెప్పారు. బాధితురాలి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.