శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (12:24 IST)

రాజస్థాన్‌లో విషాదం : పడవ మునిగి 13 మంది మృత్యువాత

రాజస్థాన్ రాష్ట్రంలో గురువారం జరిగిన విషాద ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 13కు చేరింది. చంబల్ నదిలో పడవ మునిగిపోవడంతో ఈ విషాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సహాయక బృందాలు రంగంలోకి దిగి మరో రెండు మృతదేహాలను వెలికితీశాయి. మృతులను జ్యోతి (13), గ్లోమా (15)గా గుర్తించారు. ఘటనా స్థలానికి కిలోమీటరున్నర దూరంలో వీరి మృతదేహాలను గుర్తించినట్లు సహాయ బృందాలు తెలిపాయి.
 
ఖటోలీ ప్రాంతం నుంచి 35 మంది భక్తులు, 18 బైకులతో బుంది జిల్లాలోని కాళేశ్వర్‌ స్వామి ఆలయానికి వెళ్తుండగా పడవ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి 22 మంది సురక్షితంగా బయటపడగా 13 మంది గల్లంతయ్యారు. వీరిలో 11 మంది మృతదేహాలను ఇప్పటికే వెలికితీయగా శుక్రవారం మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. 
 
పడవ సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించి ప్రమాదానికి కారణమైన మహేంద్ర మీన, హేమ్‌రాజ్‌, మోదులాల్‌, వినోద్‌తోపాటు మరొకరిపై 304 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఆ రాష్ట్ర మంత్రి శాంతి ధరివాల్‌ పరిశీలించారు.