శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 14 ఆగస్టు 2017 (10:29 IST)

శభాష్ అమ్మా... అమ్మాయిని వేధించిన కొడుకులను ఖాకీలకు పట్టించిన తల్లి.. ఎక్కడ?

సాధారణంగా పిల్లలు తప్పు చేస్తే ఆ తప్పులను తల్లిదండ్రులు కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తారు. పైగా, తమ బిడ్డ అలాంటివాడంటూ గుడ్‌విల్ సర్టిఫికేట్ కూడా ఇస్తుంటారు. కానీ, ఈ తల్లి మాత్రం.. ఓ అమ్మాయిని వేధించిన

సాధారణంగా పిల్లలు తప్పు చేస్తే ఆ తప్పులను తల్లిదండ్రులు కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తారు. పైగా, తమ బిడ్డ అలాంటివాడంటూ గుడ్‌విల్ సర్టిఫికేట్ కూడా ఇస్తుంటారు. కానీ, ఈ తల్లి మాత్రం.. ఓ అమ్మాయిని వేధించిన తన ఇద్దరు కుమారులను పోలీసులకు పట్టించి... తప్పు చేసిన పిల్లలకు అండగా నిలిచే తల్లిదండ్రులకు ఆదర్శంగా నిలిచింది. రాజస్థాన్ రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ వివరాలన పరిశీలిస్తే... 
 
రాజస్థాన్‌లోని శిప్రాపథ్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతిని ఓ మహిళకు చెందిన అపూర్వ్, విశాల్ అనే ఇద్దరు కుమారులు ఇటీవల ఓ రోజు రాత్రి 9 గంటల సమయంలో ఆమె హాస్టల్ దగ్గర కిడ్నాప్ చేశారు. ఆమెను బలవంతంగా కారులోకి ఎక్కించారు. పెళ్లి చేసుకునేందుకు తీసుకువెళుతున్నామని బెదిరించారు. దీంతో ఆ యువతి తనకు వివాహం నిశ్చయమైందని చెప్పినా వారు పట్టించుకోలేదు. పైగా, కారులోనే ఆ యువతిని చితకబాదారు. 
 
దీంతో ఆమె బిగ్గరగా కేకలు వేసింది. ఈ కేకలు బయటకు వినిపించకుండా ఉండేందుకు కారులో మ్యూజిక్ సౌండ్ మరింతగా పెంచి, కారు వేగాన్ని కూడా పెంచారు. అయినా బాధితురాలు కారు నుంచి దూకేసి పారిపోయింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంతలో విషయం తెలుసుకున్న ఇద్దరు కుమారుల తల్లి వారిని పోలీసులకు పట్టించింది. కొడుకులు చేసిన తప్పుపై నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.