శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 31 అక్టోబరు 2014 (09:57 IST)

పటేల్ కృషి వల్లే భారత్‌లో హైదరాబాద్ విలీనమైంది : రాజ్‌నాథ్

ఉక్కుమనిషి సర్దార్ వల్లాభాయ్ పటేల్ కృషి వల్లే భారత్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనమైందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. పటేల్ జయంతి వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని ఆయన విగ్రహానికి రాజ్‌నాథ్ నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ సమైక్యతా పరుగును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐకమత్య సూత్రానికి కట్టుబడి ఉంటామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి చేత తెలుగులో ప్రతిజ్ఞ చేయించారు.
 
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పటేల్ జయంతి హైదరాబాద్లో జరుపుకోవటం సంతోషకరంగా ఉందన్నారు. పటేల్ కృషివల్లే హైదరాబాద్ భారతదేశంలో విలీనమైందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ విభజన సమయంలో పటేల్ కీలక పాత్ర వహించారని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంకల్పించిన జాతీయ ఐక్యతా పరుగును విజయవంతం చేయాలని రాజ్నాథ్ పిలుపునిచ్చారు.