గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2017 (11:09 IST)

రెండు రేప్‌ కేసులు.. గుర్మీత్ సింగ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష.. ఏకకాలంలో అమలు కష్టం

అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్‌కు పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గుర్మీత్‌కు మరో పదేళ్లు జైలు శిక

అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్‌కు పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గుర్మీత్‌కు మరో పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తాజా ఉత్తర్వులు వెలువరించింది. రెండు వేర్వేరు కేసుల్లో మరో పదేళ్లు జైలు శిక్షను న్యాయమూర్తి ప్రకటించారు. 
 
గుర్మీత్ సింగ్‌పై 2002లో ఇద్దరు మహిళలపై అత్యాచారం, హత్య చేసినట్లు కేసు నమోదైంది. అయితే రెండు శిక్షలు ఏకకాలంలో అమలు చేసే అవకాశం లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. గుర్మీత్‌కు సుదీర్ఘకాలం శిక్ష విధించాలని సీబీఐ న్యాయమూర్తిని కోరింది. కానీ గుర్మీత్ చేసిన సమాజసేవని పరిగణలోకి తీసుకొని శిక్షను తగ్గించాలని గుర్మీత్ తరఫు న్యాయవాది జడ్జిని కోరారు.
 
ఇదిలా ఉంటే.. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు ఒక్కో అత్యాచారం కేసులో పదేళ్ల శిక్షను మాత్రమే ఎందుకు విధించారు? యావజ్జీవ కఠిన కారాగార శిక్ష ఎందుకు విధించలేదు? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కాగా గుర్మీత్ 2002లో అత్యాచారానికి పాల్పడ్డాడు. 2005లో అతనిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అతనిపై పోక్సో చట్టం వర్తించలేదు. దీంతో కేవలం పదేళ్ల జైలు శిక్ష, 15 లక్షల చొప్పున జరిమానాకు పరిమితమయ్యాడు. మొత్తంగా 20 ఏళ్ల జైలు శిక్ష, 30 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.