1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2024 (16:12 IST)

రూ.500ల నోటు.. మహాత్మా గాంధీ స్థానంలో శ్రీ రాముడు... ఇందులో నిజమెంత?

currency notes
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ముందు, మహాత్మా గాంధీ స్థానంలో శ్రీ రాముడు ఉన్న రూ. 500 నోట్లను చూపించే చిత్రాలు ఆన్‌లైన్‌లో  చక్కర్లు కొట్టాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) జనవరి 22న రామాలయ మహాసంప్రోక్షణ మహోత్సవానికి అనుగుణంగా ఈ నోట్లను విడుదల చేస్తుందని గతంలో పుకార్లు వ్యాపించాయి. అయితే, ఈ పుకార్లను ఆర్బీఐ కొట్టివేసింది. ఇంకా అలాంటి నోట్ల జారీలో ఎటువంటి వాస్తవ ఆధారం లేదని స్పష్టం చేసింది.

నకిలీ నోట్లలో ఎర్రకోట స్థానంలో అయోధ్యలోని రామమందిరం, విల్లు, బాణం చిత్రం ఉన్నాయి. వాస్తవానికి జనవరి 14, 2024న రఘున్ మూర్తి అనే X వినియోగదారు ద్వారా భాగస్వామ్యం చేయబడిన చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి తన సృజనాత్మక పనిని దుర్వినియోగం చేయవద్దని ప్రజలను కోరుతూ అన్ని పుకార్లను స్పష్టం చేశారు.

ఇంకా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో వైరల్ క్లెయిమ్‌కు సంబంధించిన అధికారిక వివరాలు లేదా అప్‌డేట్‌లు లేవు. శ్రీరాముడి ఫొటోతో కూడిన కరెన్సీ నోటును ప్రవేశ పెడుతున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.  ఆర్బీఐ నుంచి అధికారిక ప్రకటన వస్తే గానీ 500 కరెన్సీ నోట్‌పై శ్రీరాముడు, అయోధ్య చిత్రాలు ఉంటాయని నమ్మొచ్చు.