గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2017 (06:47 IST)

హత్య కేసుల్లో గుర్మీత్ విచారణ.. పోలీసుల అధీనంలో కోర్టు ప్రాంగణం

డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీర్ రాం రహీం సింగ్‌పై నమోదైన రెండు హత్య కేసుల విచారణ శనివారం జరుగనుంది. దీంతో హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీర్ రాం రహీం సింగ్‌పై నమోదైన రెండు హత్య కేసుల విచారణ శనివారం జరుగనుంది. దీంతో హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
గుర్మీత్ అనుచరులు విధ్వంసకాండకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు సమాచారం అందించడంతో సిర్సా, పంచకుల, రోహ్‌తక్ తదితర ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును ఏర్పాటుచేశారు. గుర్మీత్ ఉన్న జైలు పరిసరాల్లో కనీవినీ ఎరుగని భద్రతను కల్పించారు. పంచకుల కోర్టు ఆవరణను ఇప్పటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. 
 
కాగా, ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం చేసిన కేసు రుజువు కావడంతో గుర్మీత్‌కు 20 సంవత్సరాల శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఆపై డేరాలో అధికారులు సోదాలు జరుపగా, పలు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. గుర్మీత్ విలాస వంతమైన జీవితం, అమ్మాయిల గదుల్లోకి రహస్య మార్గాలు, అస్తి పంజరాలు, కట్టల కొద్దీ రద్దయిన నోట్లు, బంగారం, విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.