1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 ఏప్రియల్ 2015 (11:08 IST)

మస్రత్ ఆలం అరెస్ట్: జమ్మూలో పాకిస్థాన్ జెండా.. కేంద్రం సీరియస్!

కాశ్మీర్ వేర్పాటువాద నేత మస్రత్ ఆలంను పోలీసులు అరెస్ట్ చేశారు. కాశ్మీర్‌లో పాకిస్థాన్ జెండా రెపరెపలాడటంతో శ్రీనగర్లో ఆలంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన సందర్భంగా జరిగిన ర్యాలీలో మస్రత్ అలం పాక్ జెండాను ఊపుతూ, ఆ దేశానికి అనుకూలంగా నినాదాలుచేయడాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో  ఆలం అరెస్టుకు జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ ఆదేశాలు జారీచేశారు. 
 
శుక్రవారం అలంను అదుపులోకి  తీసుకున్న పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇలాంటి వ్యక్తుల పట్ల ఎలా వ్యవహరించాలో తమకు బాగా తెలుసనీ, ఉపేక్షించే ప్రశ్నే లేదని, పరిస్థితిని కేంద్రం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని జితేంద్ర సింగ్ వెల్లడించారు.
 
కాగా సైన్యం అదుపులో ఉన్న యువకుని మరణానికి నిరసనగా శుక్రవారం ర్యాలీకి సన్నద్దమవుతున్నారనే వార్తలతో గురువారం అలం, సయ్యద్ అలీషా గిలానీలను ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. ఇటీవల వేర్పాటువాద నేత మస్రత్ జైలు నుంచి విడుదలైనపుడు భారీ ర్యాలీతో స్వాగతం చెప్పారు. ఈ ర్యాలీలో పాకిస్తాన్ జెండాను ప్రదర్శిస్తూ..  పాకిస్తాన్కు అనుకూలంగా నినాదాలు చేయడంతో వివాదం రగిలిన సంగతి తెలిసిందే.