శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2015 (14:20 IST)

ముస్లీం మహిళలనూ మనువాడండి.. యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్య..!

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి అజంఖాన్ మరొక మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు షానావాజ్ హుస్సేన్, ముక్తార్ అబ్బాస్ నక్వీలు ముస్లిం యువతులను పెళ్లి చేసుకోవాలంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయం గురించి గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. "హిందూ మతానికి చెందిన మహిళలను వివాహం చేసుకుని వారు లవ్ జిహాద్‌కు పాల్పడ్డారు. 
 
ఇప్పుడు వారు ముస్లీం మహిళలను తప్పకుండా పెళ్లి చేసుకోవాలి. మన కులంలో నాలుగు పెళ్లిళ్లు చేసుకునేందుకు అనుమతిస్తారు. సాధ్వీ ప్రాచీ ఈ విషయంపై కూడా ఏదోఒకటి మాట్లాడాలి. ఒక మహిళ 40 మంది పిల్లలను కనలేదు కదా" అని అజంఖాన్ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపుతాయో వేచి చాడాలి.