శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2017 (11:10 IST)

చెప్పుతో కొట్టింది నిజమే.. అయితే ఏంటి? మర్డర్ కేసు పెట్టుకోండి : ఎయిరిండియా ఉద్యోగులతో ఎంపీ (Video)

ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన మాట నిజమేనని, అయితే ఏంటట? అంటూ ఎయిర్ ఇండియా ఉద్యోగులపై శివసేన ఎంపీ చిర్రుబుర్రులాడారు. అంతేకాదు... తనపై మర్డర్ కేసు పెట్టుకోండంటూ ఉచిత సలహా కూడా ఇచ్చాడు. శివసేన ఎ

ఎయిరిండియా ఉద్యోగిని చెప్పుతో కొట్టిన మాట నిజమేనని, అయితే ఏంటట? అంటూ ఎయిర్ ఇండియా ఉద్యోగులపై శివసేన ఎంపీ చిర్రుబుర్రులాడారు. అంతేకాదు... తనపై మర్డర్ కేసు పెట్టుకోండంటూ ఉచిత సలహా కూడా ఇచ్చాడు. శివసేన ఎంపీ రవీంద్ర గ్వైకాడ్ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 
 
ఈ ఘటనకు సంబంధించిన 80 సెకన్ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో బహిర్గతమైంది. ఇది మరింత దిగ్భాంతి కలిగిస్తోంది. ఎయిరిండియా ఉద్యోగిని ఎంపీ చెప్పుతో కొడుతున్నప్పుడు పక్కనే ఉన్న సిబ్బంది ఎంతగా వేడుకున్నా ఆయన వెనక్కి తగ్గక పోవడం అందులో స్పష్టంగా కనిపిస్తోంది. 
 
దీంతో ఆయనపై మహిళా ఉద్యోగి ఆగ్రహం వ్యక్తం చేయగా... ‘‘ఏంటి నామీద కేసు పెడతారా... ఇప్పటికే చాలా కేసులున్నాయ్... కావాలంటే మర్డర్ కేసు పెట్టుకోండి’’ అంటూ ఆయన మాట్లాడడంతో అక్కడున్నవారంతా విస్మయం వ్యక్తం చేశారు. 
 
అనంతరం ఆమె కలుగజేసుకుని... ‘‘మీరు మా ప్రతినిధి సర్... మీరు ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డారు.. మీకు మేము ఓటేసి ఎన్నుకున్నాం... మీరు మాత్రం ఎందుకిలా చేస్తున్నారు..’’ అంటూ ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ గైక్వాడ్ వెనక్కి తగ్గలేదు సరికదా మిగతా వారిపైనా చిందులేయడం మొదలుపెట్టారు.