శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (05:31 IST)

ఆ ఎముకలేని, స్వార్థ ఇడియట్‌తో నాకేంటి పని.. కమల్‌పై విరుచుకుపడ్డ స్వామి

తమిళనాట తాజా పరిణామాలపై కమలహాసన్‌కి, బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్యస్వామికి మధ్య కొన్ని రోజులుగా ట్విట్టర్‌ యుద్ధం జరుగుతోంది.

తమిళనాట తాజా పరిణామాలపై కమలహాసన్‌కి, బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్యస్వామికి మధ్య కొన్ని రోజులుగా ట్విట్టర్‌ యుద్ధం జరుగుతోంది. కమలహాసన్‌ని ఇడియట్‌గా సంబోధిస్తూ స్వామిచేసిన ట్వీట్‌ తీవ్ర దుమారం రేపుతోంది. కమల్‌హాసన్ బీజేపీలో చేరి, ఆయన ఇష్టప్రకారం ప్రభుత్వాన్ని నడిపితే మీరు అంగీకరిస్తారా’ అంటూ అన్న ప్రశ్నకు స్వామి స్పందిస్తూ... ‘బీజేపీ గురించి నాకుతెలియదు కానీ, నేనుమాత్రం కమల్‌హాసన్ అని పిలుచుకునే ఎముకలేని అద్భుతమైన, స్వార్థ ఇడియట్‌ను అంగీకరించను’ అని ట్వీట్‌ చేశారు. 
 
దానికి కమల్‌ హసన్ కూడా ఘాటైన జవాబిచ్చా రు. ‘‘సుబ్రహ్మణ్య స్వామి తమిళుల్ని పోకిరీలన్నారు. అతన్ని నేను వ్యతిరేకించనవసరం లేదు. ఆ పని ప్రజలే చేస్తారు. నేనలా మొరటు గా బదులివ్వను. పరుషమైన రాజకీయ వాగ్యుద్ధంలో ఆయన అనుభవం నన్ను మించినది.’ అని వ్యాఖ్యానించారు.
 
అమ్మలేని రాజ్యంలో నటుడు కమలహాసన్‌ రెచ్చిపోతున్నా రు. తనదైన శైలిలో తమిళనాడు రాజకీయాలపై ట్విట్టర్‌ కామెంట్లు విసురుతున్నారు. మీ ఆగ్రహాన్ని గవర్నర్‌కు ఈ-మెయిల్‌ ద్వారా చెప్పండని కోరుతూ రాజ్‌భవన్‌ ఈమెయిల్‌ ఐడీని పోస్టు చేశారు. నిజంగానే ఆయన అభిమానులు పెద్దఎత్తున మెయిల్స్‌ పంపించారు. 
 
మొత్తంమీద ఆయన దూకుడు తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. ప్రత్యక్షంగా ఆయనపై దాడికి సిద్ధంగాలేని అన్నాడీఎంకే తన పద్ధతిలో ఇండియన నేషనల్‌ లీగ్‌ నాయకుడు ఫిర్దోస్‌తో కేసుపెట్టించింది. పళనిస్వామి అసెంబ్లీలో బలపరీక్షలో గెలిచిన సందర్భంగా హింసను ప్రేరేపించే లా కమల్‌ వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్దోస్‌ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.