శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : ఆదివారం, 1 ఫిబ్రవరి 2015 (16:02 IST)

వేసవిలో చైనా పర్యటనకు ప్రధాని మోడీ... సుష్మ స్వరాజ్ వెల్లడి!

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది వేసవిలో చైనాలో పర్యటిస్తారని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ వెల్లడించారు. ఆమె నాలుగు రోజుల పర్యటన నిమిత్తం చైనా వెళ్లారు. ఈ పర్యటనలో సుష్మతో పాటు విదేశాంగ శాఖ నూతన కార్యదర్శి జైశంకర్‌ కూడా ఉన్నారు. 
 
ఈ ప్రయటనలో భాగంగా చైనాలో భారతీయులనుద్దేశించి ప్రసంగించిన అనంతరం సుష్మ విలేకర్లతో మాట్లాడుతూ.. తనకు ఇదే తొలి చైనా పర్యటన అని తెలిపారు. కైలాష్ మానస సరోవర్ యాత్రకు మరో మార్గం ఏర్పాటు చేసే విషయమై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టిపెట్టినట్టు చెప్పారు. ఈ అదనపు మార్గం ద్వారా యాత్రికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం వీలవుతుందని ఆమె వివరించారు. 
 
కాగా, గతేడాది సెప్టెంబర్‌లో చైనా అధ్యక్షుడు ఝి జిన్ పింగ్ భారత్‌లో పర్యటించగా, అందుకు ప్రతిగానే నరేంద్ర మోడీ ఈ ఏడాది వేసవిలో ( ఏప్రిల్‌ నెలలో) చైనా పర్యటనకు వెళ్లనున్నట్టు ఆమె తెలిపారు.