ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 జూన్ 2020 (21:00 IST)

కరోనా కరాళ నృత్యం.. తమిళనాడులో ఒకేరోజు 2,865 కేసులు 33మంది మృతి

తమిళనాడులో కరోనా కరతాళనృత్యం చేస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూ వుంది. ఫలితంగా ఆ రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య పెచ్చరిల్లిపోతోంది. ఇందులో భాగంగా బుధవారం ఒక్కరోజే కొత్తగా 2,865 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 33 మంది మృతి చెందారు. 
 
తమిళనాడులో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 67,468కు చేరుకోగా, మృతుల సంఖ్య 866కు చేరింది. చెన్నైలో అత్యధికంగా 44,205, చెంగల్ పట్టులో 4,030, తిరువళ్లూరులో 2,826, తిరువన్నామలైలో 1,313, కాంచీపురంలో 1,286 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 
మరోవైపు కరోనా మహమ్మారి దేశ ప్రజలను ఆటాడుకుంటోంది. దేశంలో ఇప్పటి వరకు నాలుగు లక్షల 57 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 14,500ల మంది మరణించారు. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 
 
24 గంటల్లో 3788 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 70,390 పాజిటివ్‌ కేసులు నమోదవగా, బుధవారం వైరస్‌తో 64 మంది చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య 2365కు చేరింది.