బాలికల బట్టలు విప్పించి నృత్యం చేయించిన పోలీసులు  
                                       
                  
                  				  బాలికల హాస్టల్లోకి కొందరు మగవాళ్లు ప్రవేశించారు. వారిలో పోలీసులూ ఉన్నారు. కొందరు బాలికలతో బలవంతంగా బట్టలు విప్పించి.. వారితో నగ్నంగా నృత్యం చేయించారు.
				  											
																													
									  ఓ కేసు విచారణ పేరుతో మహారాష్ట్రలోని జల్గావ్లో పోలీసుల దుర్మార్గం ఇది. దీనికి సంబంధించి ఓ వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.
				  విచారణ కోసం నలుగురు సభ్యులతో అత్యున్నత స్థాయి కమిటీని నియమిస్తున్నట్లు బుధవారం అసెంబ్లీలో హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ముఖ్ ప్రకటించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
				  																								
	 
 
 
  
	
	
																		
									  ఈ ఘటన చాలా తీవ్రమైనదని, ప్రభుత్వం అంత సీరియ్సగా లేదని అంతకుముందు అసెంబ్లీలో బీజేపీ నేత సుధీర్ అసెంబ్లీలో ఆరోపించారు.