శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2017 (13:13 IST)

విద్యార్థినులను హత్తుకున్నాడు.. ముద్దెట్టాడు.. ఆ ఫోటోలను నెట్లో పోస్ట్ చేసిన టీచర్ (ఫోటోలు)

విద్యార్థినులను హత్తుకుని, ముద్దెడుతూ.. ఉల్లాసంగా వున్న ఉపాధ్యాయుడి ఫోటోలు ప్రస్తుతం నెట్లో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. అస్సాంకు చెందిన ఓ టీచర్ తన విద్యార్థినులతో సన్నిహితంగా, అభ్యంతరకరంగా ఉన్

విద్యార్థినులను హత్తుకుని, ముద్దెడుతూ.. ఉల్లాసంగా వున్న ఉపాధ్యాయుడి ఫోటోలు ప్రస్తుతం నెట్లో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. అస్సాంకు చెందిన ఓ టీచర్ తన విద్యార్థినులతో సన్నిహితంగా, అభ్యంతరకరంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం సృష్టించింది. అస్సాం, హైలకండి జిల్లాలో వున్న ఓ మోడల్ స్కూలులో పైసూద్ధీన్ లస్కర్ అనే వ్యక్తి టీచర్‌గా పనిచేస్తున్నాడు.
 
ఇతడు పాఠశాలలో చదివే విద్యార్థినులను లోచరుచుకుని వారితో శారీరకసంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ నేపథ్యంలో విద్యార్థులను హత్తుకుని, ముద్దులెట్టి.. అభ్యంతరకరమైన రీతిలో వున్నట్లు గల ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేశాడు. ఈ ఫోటోలను చూసి షాకైన ప్రజలు ఆ టీచర్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. విద్యార్థినులతో ఉల్లాసంగా ఉండటమే కాకుండా ఆ ఫోటోలను నెట్లో వదిలిపెట్టిన టీచర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా ఇప్పటికే కామాంధుడైన టీచర్‌పై ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫోటోలు చూసిన పోలీసులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడి వద్ద విచారణ జరుపుతున్నారే కానీ.. సంబంధిత టీచర్‌ని అరెస్ట్ చేయలేదు.