శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (12:37 IST)

మీడియాపై సుప్రీం సీరియస్.. సంచలనాల కోసం పాకులాడొద్దు..

లైంగిక వేధింపులపై మీడియా అత్యుత్సాహాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. బీహార్ వసతి గృహాల్లో వెలుగు చూసిన లైంగిక వేధింపుల ఘటనలపై వార్తలు రాయొద్దంటూ పాట్నా హైకోర్టు విధించిన నిషేధాన్ని సుప్రీం కోర్టు ఎత

లైంగిక వేధింపులపై మీడియా అత్యుత్సాహాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. బీహార్ వసతి గృహాల్లో వెలుగు చూసిన లైంగిక వేధింపుల ఘటనలపై వార్తలు రాయొద్దంటూ పాట్నా హైకోర్టు విధించిన నిషేధాన్ని సుప్రీం కోర్టు ఎత్తివేసింది. లైంగిక దాడి, వేధింపుల కేసుల్లో మీడియా సంయమనం పాటించాలని, సంచలనాల కోసం పాకులాడకూడదని హెచ్చరించింది. 
 
వసతి గృహాల్లో వెలుగు చూసిన అంశాలపై వార్తలు రాయొద్దంటూ పట్నా హైకోర్టు విధించిన నిషేధాన్ని సవాల్‌ చేస్తూ నివేదితా ఝా అనే పాత్రికేయురాలు పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు మండిపడింది. 
 
ఈ పిటిషన్‌‌ను విచారించిన జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం.. ఓ వైపు కేసు నడుస్తుంటే మరో వైపు మీడియా తీర్పులు ఇవ్వడం సరికాదని సూచించింది. తప్పుతోవ పట్టించే వార్తల విషయంలో ఎటువంటి మార్గదర్శకాలు లేవనిపిస్తోంది. దీనిపై ఎడిటర్స్‌ గిల్డ్‌, ప్రెస్‌ కౌన్సిల్‌, ఎన్‌బీఎస్‌ఏకు సమాచారం అందిస్తామని జస్టిస్‌ లోకూర్‌ తెలిపారు.