1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శనివారం, 9 ఏప్రియల్ 2016 (11:27 IST)

ఉబెర్ టాక్సీ డ్రైవర్‌ను కాల్చి చంపిన యువకులు...

దేశ రాజధాని ఢిల్లీ తన పేరు నిలబెట్టుకుంటోంది. ఇప్పటికే క్రైమ్ ఘటనలకు పెట్టించి పేరుగా దేశరాజధాని ఢిల్లీ ముందువరుసలో ఉంది. అలాంటి ఢిల్లీలో మరో దారుణ హత్య వెలుగు చూసింది. ప్యాసింజర్లుగా ట్యాక్సీ ఎక్కిన ఇద్దరు యువకులు డ్రైవర్‌ను కాల్చిచంపిన ఘటన ఢిల్లీలోని నజఫ్‌గఢ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలను పరిశీలిస్తే కుల్ దీప్ అనే వ్యక్తి ఉబెర్ ట్యాక్సీ డ్రైవర్‌గా జీవనం గడుపుతున్నాడు.
 
గత బుధవారం సాయంత్రం ఇద్దరు యువకులు అతని కారులో ఎక్కారు. కారు ప్రయాణిస్తుండగానే ఆ ఇద్దరూ కుల్దీప్‌తో గొడవపడ్డారు. గొడవ పెరిగి పెద్దదైంది. దీంతో కోపం కట్టలు తెంచుకున్న ఆ యువకులు తమ దగ్గరున్న గన్‌తో కుల్దీప్‌ను కాల్చి చంపి పారిపోయారు. 
 
ఘటన గడిచిన గంటకు గానీ కారులో డ్రైవర్ హత్యకుగురై ఉండటాన్ని గుర్తించిన స్థానికులు గుర్తించలేదు. పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఉబెర్ టాక్సీ కస్టమర్ కాల్ డేటా ఆదారంగా ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.